Book Excerpts

My Photo
Name:
Location: Hyderabad, Telangana, India

Marxist , Ambedkarite , philosopher agnost spirituality no religion

Saturday, December 07, 2024

Postmodernism, universality , regionality

 పౌర సమాజం , రాజకీయ సమాజం , పబ్లిక్ జీవితం , ప్రైవేట్ జీవితం - అనేవి ప్రపంచమంతటా, విశ్వజనీనం గా, ఒకే రకం గా ఉండవు . 

హెగెలియన్ , మార్కిస్టు ఫిలాసఫీ లో - విశ్వజనీనత అనేది ఒక ప్రధాన విలువ. 

హెగెల్ దృష్టిలో, విశ్వజనీనత అనేది ఒక సాధనం గా, ప్రాంతీయత వాస్తవీకరించ బడుతుంది. నిర్దిష్టత ను పొందుతుంది. 

మార్క్సు దృష్టి లో విశ్వజనీనత అనేది - సామాజిక నిర్మితి లోని వైరుధ్యాలు సమగ్ర రూపం పొందే క్షేత్రం . 


ఆధునికానంతర వాదుల దృష్టి కోణం ఇందుకు పూర్తి వ్యతిరేకం గా ఉంది. వారు, విశ్వజనీనత & ప్రాంతీయత అనేవి రెండు విభిన్న విషయాలు గా, విరుద్ధ అంశాలు గా, రెండితి మధ్య సయోధ్య అసాధ్యం గా , చుస్తారు . 

విశ్వ జనీనత నీ, ప్రాంతీయ వాస్తవికత నీ ఒకటి గా కలిపి చూడడం అంటే - ఈ రెండింటి లోనూ ఒక దానిని తక్కువ చేసి చూడడం గా భావిస్తారు. 

ఎందుకంటే, ( పోస్టు మోడర్నిష్టు ల అభిప్రాయం ప్రకారం ) ఆధునికత అనేది, మొదటి నుంచి విశ్వ జనీనత కి పట్టం కడుతూ, ప్రాంతీయతలని ధ్వంసం చేస్తూ వచ్చింది . 


" విశ్వ మానవుడు, విశ్వ నాగరికత " పేరు తో , ఆధునికత, ప్రాంతీయ సంస్కృతులని, నాగరికతలను, జీవన విధానలనూ, ధ్వంసం చేస్తూ వచ్చింది . 

ఆధునికీకరణ క్రమం లో , ఈ విశ్వజనీనత అనేది అసాధారణ రూపం లో కొనసాగింది ! 

Labels:

Monday, November 11, 2024

223 . Michael Foucault on how State Apparatus uses individuals

Michael Foucault ( మైకేల్ ఫ్యూకో ) on the State , its vice like grip on Individuals and how it uses individuals for its own perpetuation and strengthening . 

 \" ఆధునిక యుగం లో, రాజ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యం తో నడిచే ప్రభుత్వాలకి , ప్రజల గురించి కానీ, వారి సంక్షేమం గురించి కానీ ఆందోళన చెందాల్సిన అవసరం కాని, చింత కానీ అంతగా ఉండదు. అందువల్ల, రాజ్యం, సమాజం లోని వ్యక్తులని అంతగా పట్టించుకోదు. 

వ్యక్తులు, సమూహాలు, రాజ్యం యొక్క శక్తి ని ఎంతవరకు పెంచుతాయని పాలకులు భావిస్తారో, అంతవరకు మాత్రమే, ప్రభుత్వం, వ్యక్తుల, సమూహాల శక్తులని పెంచుతుంది . 

వ్యక్తుల అస్తిత్వం నుంచి, వారి ప్రవర్తన, ఆలోచన, చివరికి వారి మరణం తో సహా, రాజ్యానికి ఎంతవరకు ఉపయోగపడతాయి ? అనే నిరంతర ఆలోచనలోనే ప్రభుత్వాలు ఉంటాయి. 

అలా, వ్యక్తి రాజకీయ ఉపయోగం గురించి మాత్రమే ఆలోచించే రాజ్యం, వ్యక్తి ని అంచుల్లోకి ( margins  ) నెట్టేస్తుంది . 

ఈ ' అంచుల్లోకి నెట్టి వేసే క్రమం ఎంత తీవ్రం గా ఉంటుందో వివరిస్తూ, ఫ్యూకో ( Michael Foucault )  ఇలా అంటారు . 

" కొన్ని సందర్భాలలో, రాజ్యం కోసం వ్యక్తి జీవించడం, శ్రమించడం, ఉత్పత్తి చేయడం, వినిమయం చేయడం, అవసరమైతే చావడం కూడా చెయ్యాల్సి ఉంటుంది ! 

ప్రాచీన కాలం లో (  Modernism  / ఆధునికతా వాదం కి ముందర ) - రాజ్య ప్రయోజనం గురించి వ్యక్తిని వాడడం అనేది, నైతిక నిర్బంధం వల్ల, మతం, దేవుడు వంటి నమ్మకాల వల్ల, మనుషులను నియంత్రించడం , వాడుకోవడం సాధ్యం అయేవి  ( emotional blackmail and cultural brainwash ) . 

దీనికి భిన్నం గా, 17 వ శతాబ్దం లో ముందుకి వచ్చిన ఆధునిక రాజ్య హేతువు ( State and its reason for being ; or ' Raison de' tre )  , ' పోలీసు ' అనే కొత్త వ్యవస్త ద్వారా , రాజ్యాన్ని బలొపేతం చేయడానికి వ్యక్తి ని వాడుకోవడం ప్రారంబించింది  . 

రాజ్యం అనేది, తన పరిపాలనా యంత్రాంగాన్ని, నిర్మాణాలని,  న్యాయ వ్యవస్థ నీ,  ప్రజలతో సమైక్య పరచ డానికి, అనుసంధానం చేయడానికి, పోలీసు వ్యవస్థ ని వాడుకుంటుంది . 

Labels:

Wednesday, November 06, 2024

Postmodern angst against the atrocities of Modernism

 మార్క్సు , ఫ్రాయిడ్, డార్విన్ చెప్పినవి, ఈ క్రమమంతా సత్యానికి చెందిన ఆధునిక అవగాహన గా అమలు అయింది. దీని ఫలితం గా, శుద్ధ హేతువు ముందు,అనుభవం నిరాకరణ కి గురి అయింది . మానవ అనుభవం లో ఉండే బహుళత్వాలూ, వైరుధ్యాలూ, సందిగ్దతలూ, సంఘర్ధణలూ, నిరాదరణ కి గురి అయ్యాయి ( ఆధునిక యుగం లో , 1790 - 1950 కి మధ్యకాలం లో ). నిరాకరింప బడ్డాయి . వస్తుగత తత్వాన్ని కూడి ఉంటుందని మనం నమ్మిన హేతువు, సంకుచితమయింది .
వస్తుగతత్వమే అన్నింటికీ సుచీ, కొలబద్ద అయింది  !
మతం, నమ్మకం - ఎంత అసహనాన్ని కలిగి ఉండేవో, కాల క్రమం లో హేతువు కూడా అంతే అసహనం పెంపొందించుకుంది.
హేతువు యొక్క శుద్ధ వెలుగులో చూసినప్పుడు, ఒకే వాస్తవికత, ఒకే దృక్కోణం, ఒకే సత్యం ఉంటాయి.

" సత్యం ఒక్కటే ! " అనే ఈ ప్రగాఢ నమ్మకం చరిత్ర లోని ఇతర ప్రత్యామ్నాయ అభిప్రాయాల పట్ల అసహనానికీ, రక్తపాతాలకీ, " పవిత్ర యుద్ధాలకీ " , మత యుద్ధాలకీ, శిరఛ్చేదనలకూ, ఇంకా అనేక రకాల భీభత్సాలకీ కారణం అయింది .
ఈ " ఒకే నమ్మకం, ఒకే విశ్వాసం " అనేది ఎంతో అసహనం తో, అద్భుత విషయాలని ముందుకు తెచ్చిన వ్యక్తులని బలి పీఠాల పైకి నెట్టింది . అమలు లో ఉన్న వాస్తవికత ను ప్రశ్నించిన వారిని బలికొంది. గొప్ప చారిత్రాత్మక ఆదర్శాల బలిపీఠం పైన , వ్యక్తులని ఊచకోత కోసింది. " ( ఆధునిక వాదం /  modernism )
పేజి 98

postmodernism page 153

 పౌర సమాజం , రాజకీయ సమాజం,  పబ్లిక్ జీవితం, private  జీవితం - అనేవి విశ్వజనీనం గా ఒకే రకం గా ఉండవు ! ఒక్కో దేశం లో, ఒక్కో సమాజం లో  , ఒక్కో రకం గా ఉంటాయి.
" modernism philosophy  " లో,  Hegelian & Marxist philosophy  లో, విశ్వజనీనత ఒక common , ప్రధాన విలువ.

 Hegel దృష్టి లో, విశ్వజనీనత ఆధారం గా ప్రాంతీయత వాస్తవీకరించ బడుతుంది. నిర్దిష్టత ను పొందుతుంది .
మార్క్స్ దృష్టి లో, సామాజిక నిర్మితి లోని వైరుధ్యాలు సమగ్ర రూపం పొందే క్షేత్రం - విశ్వజనీనత .
ఈ ఫిలాసఫీ కి విరుద్ధం గా  గా - ఆధునికానంతర వాదులు , విశ్వజనీనత , ప్రాంతీయత విరుద్ధ అంశాలుగా, రెండింటి మధ్య సయోధ్య అసాధ్యం గా, చూస్తారు.
ఆధునికత ( Modernism  ) మొదటి నుంచీ ( అనగా , 1789 ఫ్రెంచి విప్లవం, సాం స్కృతిక పునరుజ్జీవనం,  Age of enlightenment , 1850 లలో వచ్చిన పారిశ్రామిక విప్లవం,  Communist Manifesto  రచనా కాలం నుంచి ) , విశ్వ జనీనత కి పట్టం కడుతూ, ప్రాంతీయతలని ధ్వంసం చేస్తూ వచ్చింది  .
' విశ్వ మానవులు, విశ్వ నాగరికత ' పేర్లతో ప్రాంతీయ సంస్కృతులు, ప్రాంతీయ నాగరికతలు ధ్వంసం చేయబడ్డాయి.
ఈ ' విశ్వ జనీనత కీ, విశ్వ సంస్కృతి కీ లొంగని ప్రాంతీయ  జాతులు రక్తసిక్తం అయి, అనేక దాడులకు గురి అయ్యా
యి !

కొన్ని ప్రాంతాల సంస్కృతులు మాత్రమే ఉన్నతమైనవి గా , పురోగామి లక్షణాలు కలవి గా ( ఉదాహరణకి, స్వేతజాతీయుల  European  సంస్కృతి, సామాజిక  & రాజకీయ విలువలు ), ఇతర సంస్కృతులు వెనకబడినవి గా, నీచమైనవి గా చూడబడ్డాయి.
ముఖ్యం గా యూరోపియన్ సంస్కృతి , ప్రపంచం లో ప్రతి పరిణామాన్నీ, తనని ( యూరోప్ ని ) కేంద్రం గా చేసుకుని నిర్వచిస్తూ వచ్చింది  ,

పోస్ట్ మోడర్నిజం / ఆధునికానంతరత - దీనిలోని 
( Eurocentric Worldview ) ఔచిత్యాన్ని ప్రశ్నిస్తుంది . 


Thursday, October 24, 2024

Instrumental Rationality and Technocracy in Postmodernism

 సమాజం లో  Instrumental Rationality  ( తెలుగు లో దీనిని సాధక హేతుబద్ధత అనవచ్చు నేమో ? ) పెరిగిన కొద్దీ సాంకేతిక స్వామ్యం బలపడుతుంది  ( Technocracy ) 

ఈ దశలో,  science  నీ , technology  ని , దాని ఫలితాలనూ కీర్తించే వారు , చాలా ప్రధాన వ్యక్తులు గా గుర్తించ బడతారు. కీర్తించ బడతారు !

( Examples : From Sam Pitroda during 1985 to 1990 . To Infy Narayana Murty and Nandan Nilakeni in recent times. To Elon Musk trying to influence the US elections at in 2024. Many technocrats becoming bureaucrats in many governments around the world . ) 

' నిపుణులు ' గా పిలవబడే వీళ్ళు , క్రమం గా సమాజం లో అన్ని వ్యవస్థ లనీ కంట్రోలు చేసే అధికార కేంద్రాలు గా తయారు అవుతారు. 

వీరు చెప్పిందే వేదం గా అందరూ భావిస్తారు . సైన్సు , టెక్నాలజీ పై అవగాహన లేని వారంతా, రాజకీయ నాయకులతో సహా, అప్రధాన వ్యక్తులు గా పరిగణింప బడతారు . 

చాలా మంది ఆధునికానంతర వాదులు  ధోరణి ని గమనించారు . సామాజిక నియంత్రణ కి  Science and Technology  కొత్త సాధనాలు గా పరిణమించాయని ప్రకటించారు. 

వాస్తవానికి సాంకేతిక స్వామ్యం లో , సైన్సు అంతా సశాస్త్రీయం గా ఉంటుందనీ , సైన్సు వల్ల అన్నీ సత్ఫలితాలు మాత్రమే వస్తాయనీ దుష్ఫలితాలు రావనీ , గ్యారంటీ ఏమీ లేదు ! 

Wednesday, October 23, 2024

Oppression has many forms - say postmodernists .

Postmodernism and its views on mental and cultural oppression through symbolisms .  

అణిచివేత కి సంబంధించిన ఆధునికానంతర భావాలు ( postmodern views on social and cultural oppression )  , సాంప్రదాయ భావాలకి చాలా భిన్నం గా ఉంటాయి . 

సాంప్రదాయ రాజకీయాలు , చాలా బహిరంగం గా కనిపించే అణిచివేత గురించి మాత్రమే మాట్లాడతాయి . 

ఆధునికానంతర వాదం , ఇందుకు భిన్నం గా, సమాజం లో మార్మికం  ( invisible ) గా, ప్రతీకాత్మకం ( metaphorical and symbolic )  గా కనిపించే అణచివేతల్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది . 

సమాజం లో అమలు అవుతూన్న ప్రతీకాత్మక హింస  ( symbolic mental violence )  పైన ఆధునికానంతర వాదులు ఎక్కువ దృష్టి సారిస్తారు . ఈ దాడి పైకి కనబడదు కానీ, ఈ  మానసిక హింస మరింత దారుణం గా ఉంటుంది . 

NATURE OF SYMBOLIC AND CULTURAL VIOLENCE , ACCORDING TO POSTMODERN OBSERVERS 

ఈ ప్రతీకాత్మక హింస, అణచివేయ బడుతున్న వర్గాలకి, ఆ స్పృహ లేకుండా చేస్తుంది . తాము అనుభవిస్తున్న శిక్ష , తమకు అనివార్యం అనే భావం వారిలో కలుగ జేస్తుంది  ( we deserve it ! ) 

( Through propaganda machinery and advertising ) 

ఉదాహరణ కి  Frantz Fanon - వలసవాదం క్రింద నలిగిపోతున్న వారు , తమని తాము ఎలా ద్వేషించుకుంటారో చెప్పారు, ' Wretched of the Earth ' అనే పుస్తకం లో. 

( FRANTZ FANON  was an Afro Carribean writer from Martinique Islands , a French Colony in West Indies ) 

 Swedish economist Gunnar Myrdal   గ్రంధం, '  The American Dilemma  - The Negro Problem and Modern Democracy ( 1944 )  ' నల్ల జాతి వారి లో పెంచబడిన శారీరక న్యూనతా భావం వారిని ఎలా బానిసలు గా మార్చిందో చూపిస్తుంది . దానిని వారు ఎలా అంగీకరించారో చూపించింది . 

అలాగే, క్రమం గా వారు తమ పునాదుల్ని, జాతి సంబంధితమైన వారసత్వాలను ఎలా మరిచి పోవడానికి ప్రయతించారో మనకి తెలియజేస్తుంది . 

చాలా దేశాల్లో స్త్రీలు , ' శరీర నిర్మాణమే తమ స్త్రీత్వానికి గమ్యం ' అని బ్రెయిన్ వాష్ చేయబడి , ద్వితీయ శ్రేణి పౌరులు గా చూడబడి , ఎలా అణచివేతకి గురి అవుతున్నారో మనం ప్రస్తుతం కూడా చూస్తూ నే ఉన్నాం. 

పై పద్ధతుల్లో, కొన్ని ప్రజా సమూహలను , కొన్ని బృందాలను ఆత్మ న్యూనత కు గురి చేయడం ద్వారా, వారిపై ఆధిపత్యం చెలాయించడం ఎలా సులువైందో, పాలస్తీనియన్ - అమెరికన్ ప్రొఫెసర్  EDWARD SAID  లాంటి వారు ఋజువు చేశారు .

Examples : Anorexic women . Beauty Pegeants . Obsession with Size Zero shapes and fair skin . Beauty parlors business. 

Postmodernists views these as cultural violence through collective brainwash . Or obsession with height .  Let us remember that none of these physical parameters are applicable to men . We can even look at the Matrimonial Columns under ' Bride wanted ' heading and look at the desired parameters, esp fair skin and height. 

Hence, feminists embraced postmodernism in 1960 s. 


Tuesday, October 22, 2024

Postmodernism's contribution to DEIB

POSTMODERNISM and its opposition to Modernism and its contribution to Diversity, Equity, Inclusion and Belonging ( DEIB )  

ఇప్పటి దాకా మనం చూసిన ' పునాది వ్యతిరేక ఆధునికానంతర భావనలు ' విభిన్నత రాజ్యం చేయడానికి అవసరమైన తలాన్ని కల్పిస్తాయి. 

తద్వారా, ఆధునికాంతరత - స్వేచ్చ ని, విభిన్నత నీ, బహుళత్వాన్నీ, తనలో ఇముడ్చుకో గలుగుతుంది . 

ఈ చైతన్యం లో నుంచే , ఆధునికానంతర వాదం, అస్తిత్వం లో ఉన్న సాంఘిక, సాంస్కృతిక విలువలని, వాటి ఆధిక్యత నీ ప్రశ్నించ గలిగింది . 

ఉదాహరణకి, పాశ్చాత్య ప్రపంచం లో శ్వేత జాతీయుల ఆధిపత్యాన్ని నిరాకరించి , పరాయి గా చూడ బడ్డ, పరాయి స్థానాల లోకి నెట్ట బడ్డ నల్ల జాతీయులను, శ్వేత జాతీయులకు ప్రతి గా నిలపగలిగింది. 

అలాగే, స్త్రీ పురుష సంబంధాలలో , ద్వితీయ స్థానం లోకి నెట్టబడ్డ స్త్రీ జాతిని సమాన స్తానం లోకి నిలపగలిగింది - స్త్రీ వాద ఉద్యమమాల ద్వారా. 

విభిన్న సామాజిక ఉద్యమాలను, సంస్కృతులను , ఆచార వ్యవహారాలను, భావ శైలులను , అంగీకరించింది . గౌరవించింది . 

' యూరప్ కేంద్రక దృష్టికోణం ' నుంచి మానవ జాతిని విముక్తి చేసే ప్రయత్నం లో, మిగతా ప్రపంచపు ప్రాముఖ్యత ను నొక్కి చెప్పింది. 

విభిన్న సామాజిక సమూహాలు , తమ గురించి తాము ఎలుగెత్తి మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది . 

' పరాయి ' పట్ల సహనాన్ని, విభిన్నత పట్ల గౌరవాన్ని ప్రదర్శించేటట్లు చేయ గలిగింది . 

ముఖ్యం గా, సమాజం లోని ప్రతి బృందం, తమని గురించి తాము స్వంత కంఠాలతో మాట్లాడుకునే హక్కు కలిగి ఉంటుందనే విష్యాన్ని ముందుకు తెచ్చింది . 

పై ఆలోచనా సరళి ఫలితం గా, స్త్రీ ఉద్యమాలు, నల్లజాతి ఉద్యమాలు, మైనారిటీ ఉద్యమాలు, సకల అణగారిన వర్గాల అస్థిత్వ ఉద్యమాలు, ఆదిమ తెగల ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు అనేవి రంగం మీదకి వచ్చి గుర్తింపు పొందాయి. 

ఈ ఉద్యమాల పట్ల ఇంద్ర ధనస్సు లాంటి ఐక్యత  ఉంటుంది . దీనినే ' ఇంద్ర ధనస్సు సంకీర్ణత ' అన్నారు ! 

పై క్రమం అంతా కూడా, ఆధునికానంతర వాదులు ముందుకు తెచ్చిన ' పునాది వ్యతిరేక జ్ఞాన  సిద్ధాంతాల ' ద్వారా సాధ్యం అయింది . 

Page No 118 . Post Modernism , telugu book by Mr B Tirupati Rao. 

Postmodernism and its love of diversity and inclusion

 Why Postmodernism is against the ' Single Overarching idea ' or grand narrative or meta narrative ! How its core philosophy of specificity and diversity goes against the grain of Modernism , its universality and unified ideas. 

మనం ఒక సిద్ధాంతానికి అంకితం అయిపోతే , మనం ప్రపంచాన్ని , సంఘటనల్ని ఆ సిద్ధాంతపు చట్రం లో నుంచే చూస్తాము. మన పరిశీలనలు అన్నీ ఆ సిద్ధాంతపు భాష లో కూరుకు పోయి ఉంటాయి . ఈ చట్రపు పరిమితులు మన జ్ఞానాన్ని కూడా ఆవరించి ఉంటాయి . 

ప్రపంచం గురించి నూటికి నూరు శాతం జ్ఞానం  కానీ, ' అఖండ జ్ఞానం  '  కానీ , అసాధ్యం '! ప్రపంచం , ఒకే భాష ని కానీ, ఒకే భావన ని కానీ కలిగి లేదు. 

ప్రపంచం , బహుళత్వం తో, విభిన్నత తో నిండి ఉంది . అందువల్ల విశ్వ జనీన సూత్రాలకి తావు లేదు  ! 

ఈ వాస్తవాన్ని విస్మరించి, విశ్వ జనీన సూత్రాల కోసం, ప్రమాణాల కోసం అన్వేషించడం, పునాది వాదం లో ఒక భాగం . 

అన్నింటినీ ( ఫినామినా ) వివరించ గలిగే , నిర్వచించ గలిగే ఏక సూత్రం కోసం వెతుకులాట - అసంబద్ధం . 

జీవితానికి, ప్రపంచానికి అర్ధం , తయారు చేయ బడుతుంది , సృష్టించ బడుతుంది తప్ప , కనుక్కో బడదు ! 

Monday, October 21, 2024

philosophy of postmodernists - page 109

 మనలను సరళం గా, స్వంత అనుభూతుల నుంచి, మన అనుభవాలను అంతరంగీకరించుకుని, ' నీకు నీవు గా ఉండు (  ' Be yourself  ) అంటుంది, ఆధునికానంతర వాదం. 

 post modernist  - తన నిర్దిష్ట సామాజిక వాస్తవికత కి పరిమితమై ఉంటాడే తప్ప, 

" విశ్వ జనీజ వాస్తవికత ' ( Universal Reality )  పై సత్య ప్రకటనలు చేయడు / చేయదు. 

ఆధునికానంతర వాదులు , ప్రస్తుత సమస్యల గురించి, ప్రస్తుత ఆనందాల గురించే ఆలోచిస్తూ ఉంటారు. శాస్వత స్థానం లో, వీరు తక్షణ అంశాలనీ, విషయాలనీ మాత్రమే పరిగణిస్తారు. 

వీరితంతా '  Live and let live ' ధోరణి . ఆధునికానంతర వాదులకు , వారి వ్యక్తిగత జీవితం , వారికి ముఖ్యం . 

పాత విధేయతలు, శ్రేణీకరణలు, పెళ్ళి , కుటుంబం, మత సంస్థ లు, మొదలైనవి వీరిని అంతగా ప్రభావితం చెయ్యవు . 

సామూహిక కార్యాచరణ కీ, బాధ్యతలకీ, వీళ్ళు దూరం. 

ఇవి వ్యక్తిత్వ వికాసానికి అడ్డంకులని వీళ్ళు నమ్ముతారు. ఎందుకటే, సామూహిక కార్యాచరణలు వ్యక్తిగత త్యాగాన్ని కోరతాయి. 

వీరి జీవిత విధానం లో ఎటువంటి విశ్వ జనీన మైన ప్రకటనలు ఉండవు. వ్యక్తిగత స్వేచ్చ , విముక్తి , వీరి ఆదర్శాలు. 

ఒక సామాజిక విలువ కంటే, మరొక సామాజిక విలువ గొప్పదని భావించ డానికి వీరు వ్యతిరేకం. అణిచివేత నిండిన ఆలోచనా చట్రలూ, వ్యవస్థ లూ , వీళ్ళకి గిట్టవు.