My Photo
Name:
Location: Hyderabad, Telangana, India

Marxist , Ambedkarite , philosopher agnost spirituality no religion

Saturday, October 19, 2024

Post Modernism by B Tirupati Rao - page 100 - excerpt

 ఆధునికానంతర వాదులు ( Post Modernists )  , సత్యాన్ని శకలాలుగా ( fragments ) , నిరంతరం మార్పునకు గురి అవుతూ , విచ్చిన్నమయేది గా చూస్తూంటారు. 

ఆధునిక వాదుల  ( Modernists ) దృష్టి లో - సత్యం ఎప్పుడూ సత్యం ఎప్పుడూ ఒక రచయిత నీ, ఒక కర్త నీ ప్రతిపాదిస్తుంది . సత్యాన్ని వారికి ఆపాదిస్తుంది. 

ఆధునికానంతర వాదుల దృష్టి కోణం ఇందుకు భిన్నం ! వారు సత్యాన్ని ఏ ఒక్క వ్యక్తి కీ, కర్త కీ ఆపాదించరు ! 

ఒక వ్యక్తి చెప్పేది ఆమెకి / అతనికి సంబంధించినదే కానీ, ప్రపంచం మొత్తానిది కాదు ! 

ఆధునికానంతర వాదం (  Postmodernism ) సారాంశం లో మనం గ్రహించాల్సింది ఏమిటంటే - సత్యానికి సంబంధించిన వివిధ కధనాలు (  versions  ) ఉంటాయి కానీ, ఏకైక సత్యాలూ, అఖండ సత్యాలూ, విశ్వ జనీన సత్యాలు అనేవి ఉండవు . 

ఆధునికానంతర వాదం ( Postmodernim ) , ప్రాతినిద్య వాదాన్ని( concept of representation )  వ్యతిరేకిస్తుంది. అంటే - సత్యానికి ఎవరో ఒక వ్యక్తి, లేదా సమూహం లేదా బృందం ప్రాతినిధ్యం వహించ గలరు అనే భావాన్ని, ప్రతిపాదన నీ, నిరాకరిస్తుంది . 

అంతిమం గా ఆధునికానంతర వాదులు - ' విశ్వజనీనమైన సత్యాల ' స్థానం లో, వ్యక్తిగతమైన, ప్రాంతీయమైన , సాపేక్షితమైన సత్యాలని మాత్రమే అంగీకరిస్తారు . " 

Source : Post Modernism by B Tirupati Rao - page no 100 

0 Comments:

Post a Comment

<< Home