Post Modernism by B Tirupati Rao - page 100 - excerpt
ఆధునికానంతర వాదులు ( Post Modernists ) , సత్యాన్ని శకలాలుగా ( fragments ) , నిరంతరం మార్పునకు గురి అవుతూ , విచ్చిన్నమయేది గా చూస్తూంటారు.
ఆధునిక వాదుల ( Modernists ) దృష్టి లో - సత్యం ఎప్పుడూ సత్యం ఎప్పుడూ ఒక రచయిత నీ, ఒక కర్త నీ ప్రతిపాదిస్తుంది . సత్యాన్ని వారికి ఆపాదిస్తుంది.
ఆధునికానంతర వాదుల దృష్టి కోణం ఇందుకు భిన్నం ! వారు సత్యాన్ని ఏ ఒక్క వ్యక్తి కీ, కర్త కీ ఆపాదించరు !
ఒక వ్యక్తి చెప్పేది ఆమెకి / అతనికి సంబంధించినదే కానీ, ప్రపంచం మొత్తానిది కాదు !
ఆధునికానంతర వాదం ( Postmodernism ) సారాంశం లో మనం గ్రహించాల్సింది ఏమిటంటే - సత్యానికి సంబంధించిన వివిధ కధనాలు ( versions ) ఉంటాయి కానీ, ఏకైక సత్యాలూ, అఖండ సత్యాలూ, విశ్వ జనీన సత్యాలు అనేవి ఉండవు .
ఆధునికానంతర వాదం ( Postmodernim ) , ప్రాతినిద్య వాదాన్ని( concept of representation ) వ్యతిరేకిస్తుంది. అంటే - సత్యానికి ఎవరో ఒక వ్యక్తి, లేదా సమూహం లేదా బృందం ప్రాతినిధ్యం వహించ గలరు అనే భావాన్ని, ప్రతిపాదన నీ, నిరాకరిస్తుంది .
అంతిమం గా ఆధునికానంతర వాదులు - ' విశ్వజనీనమైన సత్యాల ' స్థానం లో, వ్యక్తిగతమైన, ప్రాంతీయమైన , సాపేక్షితమైన సత్యాలని మాత్రమే అంగీకరిస్తారు . "
Source : Post Modernism by B Tirupati Rao - page no 100


0 Comments:
Post a Comment
<< Home