Postmodernism's contribution to DEIB
POSTMODERNISM and its opposition to Modernism and its contribution to Diversity, Equity, Inclusion and Belonging ( DEIB )
ఇప్పటి దాకా మనం చూసిన ' పునాది వ్యతిరేక ఆధునికానంతర భావనలు ' విభిన్నత రాజ్యం చేయడానికి అవసరమైన తలాన్ని కల్పిస్తాయి.
తద్వారా, ఆధునికాంతరత - స్వేచ్చ ని, విభిన్నత నీ, బహుళత్వాన్నీ, తనలో ఇముడ్చుకో గలుగుతుంది .
ఈ చైతన్యం లో నుంచే , ఆధునికానంతర వాదం, అస్తిత్వం లో ఉన్న సాంఘిక, సాంస్కృతిక విలువలని, వాటి ఆధిక్యత నీ ప్రశ్నించ గలిగింది .
ఉదాహరణకి, పాశ్చాత్య ప్రపంచం లో శ్వేత జాతీయుల ఆధిపత్యాన్ని నిరాకరించి , పరాయి గా చూడ బడ్డ, పరాయి స్థానాల లోకి నెట్ట బడ్డ నల్ల జాతీయులను, శ్వేత జాతీయులకు ప్రతి గా నిలపగలిగింది.
అలాగే, స్త్రీ పురుష సంబంధాలలో , ద్వితీయ స్థానం లోకి నెట్టబడ్డ స్త్రీ జాతిని సమాన స్తానం లోకి నిలపగలిగింది - స్త్రీ వాద ఉద్యమమాల ద్వారా.
విభిన్న సామాజిక ఉద్యమాలను, సంస్కృతులను , ఆచార వ్యవహారాలను, భావ శైలులను , అంగీకరించింది . గౌరవించింది .
' యూరప్ కేంద్రక దృష్టికోణం ' నుంచి మానవ జాతిని విముక్తి చేసే ప్రయత్నం లో, మిగతా ప్రపంచపు ప్రాముఖ్యత ను నొక్కి చెప్పింది.
విభిన్న సామాజిక సమూహాలు , తమ గురించి తాము ఎలుగెత్తి మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది .
' పరాయి ' పట్ల సహనాన్ని, విభిన్నత పట్ల గౌరవాన్ని ప్రదర్శించేటట్లు చేయ గలిగింది .
ముఖ్యం గా, సమాజం లోని ప్రతి బృందం, తమని గురించి తాము స్వంత కంఠాలతో మాట్లాడుకునే హక్కు కలిగి ఉంటుందనే విష్యాన్ని ముందుకు తెచ్చింది .
పై ఆలోచనా సరళి ఫలితం గా, స్త్రీ ఉద్యమాలు, నల్లజాతి ఉద్యమాలు, మైనారిటీ ఉద్యమాలు, సకల అణగారిన వర్గాల అస్థిత్వ ఉద్యమాలు, ఆదిమ తెగల ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు అనేవి రంగం మీదకి వచ్చి గుర్తింపు పొందాయి.
ఈ ఉద్యమాల పట్ల ఇంద్ర ధనస్సు లాంటి ఐక్యత ఉంటుంది . దీనినే ' ఇంద్ర ధనస్సు సంకీర్ణత ' అన్నారు !
పై క్రమం అంతా కూడా, ఆధునికానంతర వాదులు ముందుకు తెచ్చిన ' పునాది వ్యతిరేక జ్ఞాన సిద్ధాంతాల ' ద్వారా సాధ్యం అయింది .
Page No 118 . Post Modernism , telugu book by Mr B Tirupati Rao.


0 Comments:
Post a Comment
<< Home