philosophy of postmodernists - page 109
మనలను సరళం గా, స్వంత అనుభూతుల నుంచి, మన అనుభవాలను అంతరంగీకరించుకుని, ' నీకు నీవు గా ఉండు ( ' Be yourself ) అంటుంది, ఆధునికానంతర వాదం.
post modernist - తన నిర్దిష్ట సామాజిక వాస్తవికత కి పరిమితమై ఉంటాడే తప్ప,
" విశ్వ జనీజ వాస్తవికత ' ( Universal Reality ) పై సత్య ప్రకటనలు చేయడు / చేయదు.
ఆధునికానంతర వాదులు , ప్రస్తుత సమస్యల గురించి, ప్రస్తుత ఆనందాల గురించే ఆలోచిస్తూ ఉంటారు. శాస్వత స్థానం లో, వీరు తక్షణ అంశాలనీ, విషయాలనీ మాత్రమే పరిగణిస్తారు.
వీరితంతా ' Live and let live ' ధోరణి . ఆధునికానంతర వాదులకు , వారి వ్యక్తిగత జీవితం , వారికి ముఖ్యం .
పాత విధేయతలు, శ్రేణీకరణలు, పెళ్ళి , కుటుంబం, మత సంస్థ లు, మొదలైనవి వీరిని అంతగా ప్రభావితం చెయ్యవు .
సామూహిక కార్యాచరణ కీ, బాధ్యతలకీ, వీళ్ళు దూరం.
ఇవి వ్యక్తిత్వ వికాసానికి అడ్డంకులని వీళ్ళు నమ్ముతారు. ఎందుకటే, సామూహిక కార్యాచరణలు వ్యక్తిగత త్యాగాన్ని కోరతాయి.
వీరి జీవిత విధానం లో ఎటువంటి విశ్వ జనీన మైన ప్రకటనలు ఉండవు. వ్యక్తిగత స్వేచ్చ , విముక్తి , వీరి ఆదర్శాలు.
ఒక సామాజిక విలువ కంటే, మరొక సామాజిక విలువ గొప్పదని భావించ డానికి వీరు వ్యతిరేకం. అణిచివేత నిండిన ఆలోచనా చట్రలూ, వ్యవస్థ లూ , వీళ్ళకి గిట్టవు.


0 Comments:
Post a Comment
<< Home